ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. నర్సీపట్నం(Narsipatnam) పర్యటనపై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు(Prathipati Pulla Rao) పంచ్లు పేల్చేరు. జగన్ పర్యటన అంతా కూడా మూడు అవమానాలు, ఆరు నిరసనలుగా సాగిందంటూ విసుర్లు విసిరారు. ప్రజాదరణ లేని పర్యటనలు చేస్తే హేళనలే మిగులుతాయని జగన్ పర్యటన మరోసారి నిరూపించిందంటూ చరుకలంటించారు. అంతేకాకుండా నర్సీపట్నం పర్యటనలో మెడికల్ కాలేజీలపై జగన్ మాట్లాడటాన్ని ఆయన విమర్శించారు. ఆరోగ్యశ్రీ బకాయిలు ఎగ్గొట్టిన జగన్.. పేదలను కార్పొరేట్ వైద్యం అందిస్తారా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి. గత ప్రభుత్వ హయాంలో జాతీయ ఆరోగ్య మిషన్ నిధులను దారి మళ్లించారని విమర్శించారు. అలాంటి వాళ్లు వచ్చి ఇప్పుడు కాపాడతామంటున్నారా? అని ప్రశ్నించారు. కాలేజీలకు కేంద్రం ఇచ్చిన సొమ్మును ఏం చేశారో జగన్ చెప్పాలని ప్రత్తిపాటి పుల్లారావు(Prathipati Pulla Rao) డిమాండ్ చేశారు. భూములు కేటాయించి శంకుస్థాపన చేస్తే కళాశాలలు పూర్తవ్వవని అన్నారు.
ఇదిలా ఉంటే నర్సీపట్నం పర్యటనలో భాగంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జగన్ తప్పుబట్టారు. ‘‘వైద్యకళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే పేదవారికి వైద్యం ఎలా అందుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వాటిలో ఏడు కాలేజీలు పూర్తయ్యాయి. ఆ ఏడింటిలో ఐదు కాలేజీలు ఇప్పటికే క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. 2023-24 విద్యాసంవత్సరం మెడికల్ సీట్లతో అక్కడ బోధన స్టార్ట్ అయింది. విజయనగరం, పాడేరు మెడికల్ కాలేజీల క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి. మెడికల్ కాలేజీలు పేదవారికి ఉచిత వైద్యంతో పాటు మెడిసిన్ చదవడానికి అవకాశం కల్పించే దేవాలయాలు’’ అని జగన్(YS Jagan) వ్యాఖ్యానించారు.
Read Also: సీఎంను గంటలో చంపుతా.. పోలీసులకే వార్నింగ్

