Mobile Popup Ad
Mobile Popup Ad

సరస్వతి అంత్య పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించిన పొన్నం

కలం, వెబ్ డెస్క్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాల్లో భాగంగా గోదావరి నదిలో మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పుణ్య స్నానం ఆచరించారు. అనంతరం గోదావరి నదికి వేదపండితుల సమక్షంలో మహా హారతి ఇచ్చారు. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి సన్నిధిలో సరస్వతి పుష్కరాలు గత సంవత్సరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తే.. ఈసారి అంత్య పుష్కరాల్లో గవర్నర్, మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో లక్షలాదిమంది సరస్వతి అంత్య పుష్కరాల్లో పాల్గొని పుణ్య స్నానం ఆచరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భవిష్యత్ లో మంచి జరగాలని తెలంగాణ రాష్ట్రమంతా సుభిక్షమైన వర్షాలతో సస్యశ్యామలంగా రైతులు పాడిపంటలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికి శుభం జరగాలని గోదావరి అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>