కలం, మెదక్ బ్యూరో: హోంవర్క్ చేయలేదని పాలిటెక్నిక్ విద్యార్థులపై ఓ లెక్చరర్ పైశాచికంగా ప్రవర్తించాడు. ఈ ఘటన సంగారెడ్డి (Sangareddy) జిల్లా హత్నూర మండలం తుర్కల ఖానాపూర్ శివారులోని రత్నపురి ఇన్స్టిట్యూట్లో చోటు చేసుకున్నది. పాలిటెక్నిక్ ఫస్టియర్ చదువుతున్న 15 మంది విద్యార్థులను HOD శివారెడ్డి కేబుల్ వైర్లతో తీవ్రంగా కొట్లాడు. విద్యార్థుల కాళ్లకు గాయాలయ్యాయి. శివారెడ్డి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాడని, దాడి చేశాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. శివారెడ్డిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్ చేశారు.

