కలం, వెబ్డెస్క్: కర్ణాటకలో కొన్నాళ్లుగా జరుగుతున్న విందు రాజకీయాలు మరో మలుపు తీసుకున్నాయి. గురువారం రాత్రి ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) పాల్గొన్న విందుకు బీజేపీ బహిష్క్కత ఎమ్మెల్యేలు హాజరవడం సరికొత్త చర్చకు దారితీసింది. అధిష్టానం అంగీకరించకపోతే తన వర్గం ఎమ్మెల్యేలతో కలసి డీకే సీఎం పీఠం అధిరోహిస్తారని, దానికి బీజేపీ మద్దతు ఇస్తుందనే ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విందులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యేలు ఎస్టీ సోమశేఖర్, శివరామ్ హెబ్బార్ కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, బెళగావిలో కాంగ్రెస్ నేత ప్రవీణ్ ఇంట్లో జరిగిన ఈ డిన్నర్లో డీకేతోపాటు మంత్రులు కేహెచ్ మునియప్ప, మంకాల్ వైద్య, డాక్టర్ ఎంసీ సుధాకర్తో పాటు 30 మందికి పైగా ఎమ్మెల్యేలు హాజరైనట్లు సమాచారం.
ఇది సాధారణ విందు మాత్రమేనని, రాజకీయ ప్రాధాన్యం డీకే (DK Shivakumar) చెబుతున్నప్పటికీ.. ఈ డిన్నర్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను, అధిష్టానాన్ని ఇరుకున పెట్టేదే. మరోవైపు, అంతకుముందు రోజు బెళగావి మాజీ ఎమ్మెల్యే ఫిజోర్ ఇంట్లో జరిగిన ఓ విందులో తన మద్దతుదారులు, సన్నిహితులతో కలసి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొనడం గమనార్హం. ఇప్పటివరకు సిద్ధరామయ్య, డీకే మధ్య స్వగృహాల్లో బ్రేక్ఫాస్ట్ చర్చలు జరపగా, ఇప్పుడు మద్దతుదారులతో వేర్వేరుగా విందుల్లో పాల్గొనడం కర్ణాటక రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది.
Read Also: Tన్యూస్, ఇద్దరు ఎమ్మెల్యేలకు కవిత లీగల్ నోటీస్
Follow Us On: X(Twitter)


