కలం, వెబ్ డెస్క్ : కృష్ణా జిల్లా చల్లపల్లి (Challapalli) పోలీస్స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారం మేరకు పోలీసులు నిర్వహించిన తనిఖీలలో 10.8 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులు పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వేగంగా పారిపోతుండగా వారి బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు గాయపడగా, వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గంజాయి సరఫరా వెనుక ఉన్న ముఠా గురించి ఆరా తీస్తున్నారు.

