కలం, వెబ్ డెస్క్ : విదేశీ ప్రయాణాలపై పన్నులు లేదా సర్ ఛార్జీ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నదని వస్తున్న వార్తలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. ఫారెన్ టూర్లపై సెస్ విధిస్తున్నట్లు వార్తలను ఆయన ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రధాని స్వయంగా పోస్ట్ పెట్టారు. విదేశీ ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించబోమని ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రజల వ్యాపారాన్ని, జీవన విధానాన్ని సులభతరం చేసే విధానాలకు తాము కట్టుబడి ఉన్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.

