కలం, వెబ్ డెస్క్ : విదేశీ ప్రయాణాలపై పన్నులు లేదా సర్ ఛార్జీ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నదని వస్తున్న వార్తలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. ఫారెన్ టూర్లపై సెస్ విధిస్తున్నట్లు వార్తలను ఆయన ఖండించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రధాని స్వయంగా పోస్ట్ పెట్టారు. విదేశీ ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించబోమని ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రజల వ్యాపారాన్ని, జీవన విధానాన్ని సులభతరం చేసే విధానాలకు తాము కట్టుబడి ఉన్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Read Also: ఇంధన ధరల పెంపు.. మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
Follow Us On: WhatsApp

