కలం, నిర్మల్ రూరల్: దేశ ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని నిర్మల్ (Nirmal) రూరల్ మండలం తల్వేదలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అంతకుముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విశ్వకర్మ జయంతి సందర్భంగా భగవాన్ శ్రీ విశ్వకర్మ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నిరంజన్ రెడ్,డి ఆయా మండలాల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, బర్కుంట నరేందర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

