కలం, స్పోర్ట్స్ : పీఎస్ఎల్ 11కు ముందు పేశావర్ జల్మీ కీలక ప్రకటన చేసింది. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ (Misbah ul Haq) ను జట్టు కొత్త బ్యాటింగ్ కోచ్గా నియమించింది. ఈ తాజా అప్డేట్ను ఫ్రాంచైజీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మిస్బా ఉల్ హక్ 2001 నుంచి 2015 వరకు పాకిస్థాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. ఈ సమయంలో ఆయన 75 టెస్టులు, 162 వన్డేలు, 39 టీ20 మ్యాచ్లు ఆడారు. కెప్టెన్గా 151 మ్యాచ్లకు నాయకత్వం వహించి, 7392 పరుగులు సాధించారు.
మిస్బా (Misbah ul Haq) అనుభవం, నాయకత్వం, వ్యూహాత్మక ఆలోచన జట్టుకు అదనపు బలంగా నిలుస్తాయని జల్మీ పేర్కొంది. గతంలో ఆయన పీఎస్ఎల్ తొలి సీజన్లో ఇస్లామాబాద్ యునైటెడ్ను విజేతగా నిలిపారు. ఆ తర్వాత 2018 సీజన్లో పేశావర్ జల్మీ తరఫున మూడు మ్యాచ్లు ఆడిన మిస్బా, ఆ సీజన్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఈ రోజే జల్మీ కోచింగ్ సిబ్బందిని మరింత బలోపేతం చేసింది.
మాజీ ఆల్రౌండర్లు అజర్ మహ్మద్, ఒట్టిస్ గిబ్సన్ను సిబ్బందిలో చేర్చుకుంది. ఫిబ్రవరి 11న జరగనున్న పీఎస్ఎల్ 11 ప్లేయర్స్ వేలానికి ముందు జట్టు నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసింది. ప్లాటినం కేటగిరీలో బాబర్ ఆజం ముందంజలో ఉన్నారు. డైమండ్లో సుఫియాన్ ముఖీమ్, గోల్డ్లో అబ్దుల్ సమద్, ఎమర్జింగ్లో అలీ రజాను నిలుపుకుంది.
ఇదిలా ఉండగా, డైరెక్ట్ సైనింగ్ ద్వారా తీసుకున్న అఫ్గానిస్తాన్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ సీజన్కు ముందు తప్పుకున్నారు. ఈ తాజా మార్పులతో పేశావర్ జల్మీ కొత్త సీజన్కు సిద్ధమవుతోంది. పీఎస్ఎల్ 11పై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
Read Also: భారత బ్యాట్లపై శ్రీలంక ప్లేయర్ కీలక ఆరోపణలు
Follow Us On: Instagram


