అభిమాని మృతిపై స్పందించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) జ‌న్మ‌దిన వేడుక‌ల కోసం ఏర్పాట్లు చేస్తున్న క్ర‌మంలో అమ‌లాపురంలో ఓ అభిమాని మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించిన‌ట్లు జ‌న‌సేన‌ పార్టీ ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించింది. మృతుడు ప్రేమ్‌కుమార్ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రార్థించారు. అత‌డి కుటుంబ‌స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. బాధిత కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న అభిమానుల‌కు కీల‌క సందేశాన్ని అందించారు. జీవితం ఎంతో విలువైంద‌ని, యువ‌త వేడుక‌లు, ఉత్స‌వాల సంద‌ర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే స‌మ‌యంలో త‌మ‌కు ఓ కుటుంబం ఉంద‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌న్నారు. ఎత్తైన ప్ర‌దేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే స‌మ‌యంలో ర్యాలీల‌లో త‌మ భ‌ద్ర‌త‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌న్నారు. అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తూ ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>