కలం, వెబ్ డెస్క్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన(JanaSena) పోటీపై ఉత్కంఠకు తెర పడింది. ఎన్నికల్లో బీజేపీ(BJP)కి జనసేన మద్దతు ఇవ్వనున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి పవన్ కల్యాణ్ తో ఆయన నివాసంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వారు చర్చించారు. ఈ సందర్భంగా బీజేపీకి పవన్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అంతే కాకుండా బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటానని పవన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఫిబ్రవరి 6వ తేదీన పలు చోట్ల పవన్ ఎన్నికల ప్రచారం చేస్తారని తెలుస్తోంది.


