కలం, వెబ్డెస్క్: పాకిస్థాన్ (Pakistan) లో పోలీస్ వాహనాన్ని పేల్చివేయడంతో ఏడుగురు దుర్మరణం చెందారు. ఈ సంఘటన బుధవారం ఖైబర్పఖ్తూంక్వా రాష్ట్రంలోని టంక్ జిల్లాలో జరిగింది. పోలీస్ సిబ్బంది వాహనంలో గస్తీ నిర్వహిస్తుండగా, రోడ్డు కింద పాతిపెట్టిన శక్తిమంతమైన ఐఈడీ బాంబ్ను రిమోట్తో పేల్చడంతో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఇందులో బాంబు దాడి అనంతరం మిగిలిన పోలీస్ సిబ్బందిపై దుండగులు కాల్పులు జరపడం చూడవచ్చు. ఈ దురాగతానికి పాల్పడింది తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్థాన్(టీటీపీ)కి చెందినవాళ్లని టంక్ జిల్లా డిప్యూటీ పోలీస్ చీఫ్ పర్వేజ్ షా వెల్లడించారు. చనిపోయినవాళ్లలో ఒక ఎస్ఐ,స్టేషన్ హౌస్ఆఫీసర్, నలుగురు కానిస్టేబుల్స్, డ్రైవర్ ఉన్నట్లు తెలిపాడు.
కాగా, కొంతకాలంగా పాక్ (Pakistan) లో పోలీసులు, సైన్యంపై దాడులు పెరిగాయి. ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులోని ఖైబర్ పఖ్తూంక్వాలో టీటీపీ, బెలూచిస్తాన్లో బెలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేస్తోంది. రెండు రోజుల కిందట కూడా నలుగు శాంతి కమిటీ సభ్యులను కాల్చి చంపారు. కాగా, టీటీపీని ఆఫ్ఘనిస్థాన్ ఎగదోస్తోందంటూ పాక్ మంత్రి మోహిసిన్ నఖ్వీ మండిపడ్డారు.
Read Also: రిజర్వుడ్కు 0, జనరల్కు 7 పర్సంటైల్.. నీట్ పీజీ కటాఫ్ తగ్గింపు!
Follow Us On: Sharechat


