epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రిజర్వుడ్​కు 0, జనరల్​కు 7 పర్సంటైల్​.. నీట్​ పీజీ కటాఫ్​ తగ్గింపు!

కలం, వెబ్​డెస్క్​: దేశవ్యాప్తంగా ఖాళీగా మిగిలిన వేలాది వైద్య పీజీ సీట్ల భర్తీకి నేషనల్​ బోర్డ్​ ఆఫ్​ ఎగ్జామినేషన్స్​ ఇన్​ మెడికల్​ సైన్సెస్ (NBEMS) కీలక నిర్ణయం తీసుకుంది. నీట్​ పీజీ –2025 అర్హత మార్కుల కటాఫ్ (NEET PG 2025 cutoff) ​ను భారీగా తగ్గించింది. ఇప్పటికే రెండు దశల కౌన్సెలింగ్​ పూర్తయినప్పటికీ ఇంకా 18వేల సీట్లు భర్తీ కాకపోవడంతో కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు కటాఫ్​ పర్సంటైల్​ తగ్గింపు ప్రకటించింది. దీని ప్రకారం రిజర్వుడ్​ కేటగిరీ(ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ) అభ్యర్థులకు కటాఫ్​ తగ్గింపు ఏకంగా జీరో అయ్యింది. అంటే ఈ కేటగిరీల అభ్యర్థులకు నెగిటివ్​ మార్కులు వచ్చినా వాళ్లు కౌన్సెలింగ్​కు అర్హులే. అలాగే జనరల్​, ఈడబ్ల్యూఎస్​కు 50 నుంచి 7కు, దివ్యాంగ అభ్యర్థులకు 45 నుంచి 5కు పర్సంటైల్​ తగ్గింది. కాగా, కటాఫ్​ తగ్గింపుపై అధికారులు మాట్లాడుతూ.. ఇప్పటికే ఎంబీబీఎస్​ పూర్తి చేసిన అభ్యర్థులు మళ్ళీ నిరూపించుకోవాల్సిన అవసరం లేనందున, పీజీ విభాగంలో స్పెషలిస్ట్​ల కొరతను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

Read Also: తప్పు చేయకుంటే బ్యాంకాక్ ఎందుకు పారిపోతున్నారు? : సీపీ సజ్జనార్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>