నేడు ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్ల మీటింగ్

కలం, వెబ్ డెస్క్: పార్లమెంట్ సమావేశాలు 11వ రోజు జరుగనున్న నేపథ్యంలో ఢిల్లీలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్ల సమావేశం (Parliament Session) జరగనుంది. పార్లమెంట్‌లోని రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో సభ్యులు సమావేశం కానున్నారు. పార్లమెంట్‌లో అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు.. ప్రజాసమస్యలను, కీలక అంశాలను ప్రస్తావించడంపై చర్చించనున్నారు. ఉభయసభల్లో అధికార పక్షాన్ని నిలదీసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>