epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

విడాకులకు ఆ నిబంధన తప్పనిసరి కాదు: ఢిల్లీ హైకోర్టు

కలం, వెబ్​డెస్క్: దంపతులు పరస్పర సమ్మతితో విడాకులు కోరితే.. పిటిషన్​ దాఖలు చేయడానికి ఏడాది పాటు వేరు (One year separation) గా జీవించాలనే నిబంధన తప్పనిసరి కాదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. అవసరమైన సందర్భాల్లో ఫ్యామిలీ కోర్టులు, హైకోర్టులు ఈ నిబంధన మినహాయించవచ్చని తెలిపింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్​ 13బి(1)లో ఉన్న ఏడాది నిబంధనను డైరెక్టరీ(మార్గదర్శకమైనది)గానే పరిగణించాలని, తప్పనిసరి(మ్యాండేటరీ) కాదని పేర్కొంది. ఈ మేరకు బుధవారం జస్టిస్​ నవీన్​ చావ్లా, జస్టిస్​ అనూప్​ జైరాం భంభానీ, జస్టిస్​ రేణు భట్నాగర్​లతో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13బి(1) ప్రకారం దంపతులు విడాకులు పొందాలంటే, పిటిషన్​ దాఖలు చేయడానికి ముందు కనీసం ఏడాది పాటు విడిగా జీవించాలి. అయితే, ప్రస్తుత తీర్పు ఈ నిబంధన కచ్చితం కాదని స్పష్టం చేసింది.

ఇంకా ధర్మాసనం ఏమందంటే.. పరస్పర సమ్మతి లేని లేదా దంపతుల మధ్య అసాధారణ పరిస్థితులు లేదా కష్టాలు ఉన్న సందర్భాల్లో చట్టబద్దంగా వేచి ఉండే కాలాన్ని సెక్షన్​ 14(1) ప్రకారం మినహాయించే అధికారం ఉంది. ఇదే సెక్షన్​ను పరస్పర సమ్మతితో విడాకులు కోరే సందర్భాల్లో వర్తింపచేయకుండా ఉండడానికి ఎలాంటి చట్టబద్ధమైన ఆధారం లేదని కోర్టు పేర్కొంది. ఇష్టంలేని భార్యాభర్తలను 13బి(1)లోని ఏడాది నిబంధన (One year separation) ప్రకారం చట్టపరంగా బంధించి ఉండడం రాజ్యాంగలోని ఆర్టికల్​ 21 ప్రకారం ఉన్న వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవంపై అనవసర జోక్యంగా మారవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా, ఈ తీర్పు విడాకుల కేసుల్లో కీలకంగా మారనుంది.

Read Also: ప్రైవేట్ ఈ-మెయిల్స్ వాడకంపై నిషేధం

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>