కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టౌన్-3 పోలీస్ స్టేషన్ పరిధి దుబ్బ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళ మెడలో నుంచి మంగళసూత్రాన్ని , కమ్మలు (Chain Snatching) అపహరించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సంఘటన స్థలాన్ని సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితురాలితో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు.
అనంతరం దర్యాప్తు అధికారులకు పలు కీలక సూచనలు చేస్తూ , ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను వెంటనే పరిశీలించాలని , నిందితులను గుర్తించి అత్యంత వేగంగా అరెస్టు చేయాలని ఆదేశించారు. ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని , నేరస్తుల కదలికలను సాంకేతిక ఆధారాలతో విశ్లేషించాలని కమిషనర్ సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

