కలం, నిజామాబాద్, బ్యూరో: 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని (Independence Day) పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ( Collector Bhavesh Mishra) నిజామాబాద్ (Nizamabad) కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ వి. భుజంగరావు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ట్రైనీ కలెక్టర్ సురేష్, ట్రైనీ ఆర్డీఓ సందీప్, కలెక్టరేట్ ఏ.ఓ బాలరాజు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

