కలం, వెబ్ డెస్క్: నేపాల్లో ఎన్నికల (Nepal Election) పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. గత ఏడాది జెన్జెడ్ యువత నేతృత్వంలో జరిగిన ఆందోళనలతో కేపీ శర్మా ఓలి ప్రభుత్వం కూలిపోయిన తర్వాత జరుగుతున్న మొదటి సాధారణ ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది. అనంతరం బ్యాలెట్ పెట్టెలను సేకరించిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఎన్నికల్లో 1.89 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ ద్వారా ఎన్నుకునే 165 స్థానాలకు 3,406 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రి సుశీలా కార్కి (Sushila Karki) ఎన్నికల్లో ఓటు వేయడానికి కాఠ్మాండులోని ధపాసి పోలింగ్ సెంటర్కు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతు తన డ్యూటీ అయయిపోయిందని చెప్పారు. మీడియా మరిన్ని ప్రశ్నలు వేసేందుకు ప్రయత్నించగా ఆమె సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు.

