కలం, స్పోర్ట్స్ : టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (MSK Prasad) పదవీకాలాన్ని ఇప్పుడే అంచనా వేయలేమని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ అన్నారు. ఐర్లాండ్తో జరిగిన సిరీస్ను భారత్ 2-0తో, ఇంగ్లాండ్ సిరీస్ను 4-0తో కోల్పోయింది. అయితే ఈ పరాజయాలకు గంభీర్ను మాత్రమే బాధ్యుడిని చేయలేమని ఆయన స్పష్టం చేశారు. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు లేకుండానే భారత్ ఈ మ్యాచ్లు ఆడిందని గుర్తుచేశారు. జట్టు తక్కువ స్కోరు చేయగానే కోచ్ను నిందించడం సరికాదని ప్రసాద్ అభిప్రాయపడ్డారు.
ప్రపంచకప్ గెలిచినప్పుడు మాత్రమే కాకుండా, ఓడినప్పుడు కూడా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. బుమ్రా, పాండ్యాలతో కూడిన పూర్తి స్థాయి జట్టు తదుపరి టీ20 సిరీస్ ఆడినప్పుడు మాత్రమే కోచ్, కెప్టెన్ల సామర్థ్యం బయటపడుతుందని చెప్పారు. అయితే సంజూ శాంసన్ను జట్టు నుంచి తొలగించడంపై ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజూను పక్కన పెట్టడం పెద్ద తప్పు అని విమర్శించారు.
ఇంగ్లాండ్ పిచ్లపై సంజూ అద్భుతంగా ఆడగలడని కొనియాడారు. టీ20 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ల్లో గెలిపించిన ఆటగాడిని కేవలం రెండు మూడు మ్యాచ్లు ఆడలేదని తీసేయడం ఏంటని ప్రశ్నించారు. అలాగే 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని (Vaibhav Suryavanshi) జట్టులోకి తెచ్చిన విధానాన్ని కూడా ఆయన (MSK Prasad) తప్పుబట్టారు.
వైభవ్ను నేరుగా ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టుపై ఆడించడం వల్ల జట్టులో గందరగోళం నెలకొందన్నారు. మొదట అతడిని ఐర్లాండ్, జింబాబ్వే టూర్లకు పంపి ఉంటే బాగుండేదన్నారు. వైభవ్కు దేశవాళీ క్రికెట్ ఆడే అవకాశం ఇచ్చి, నెమ్మదిగా జట్టులోకి తీసుకురావాలని సూచించారు. ఏదేమైనా భవిష్యత్తు సిరీస్లలో టీమిండియా ప్రదర్శనపైనే అందరి దృష్టి నెలకొంది.
Read Also: భద్రాచలం వారధి.. గుండెలను పిండేసే కన్నీటి కథకు 62 ఏళ్ళు
Follow Us On: X(Twitter)

