ఉప్పల్ వేదికగా ధోని మేనియా.. పసుపు వర్ణంగా మారనున్న స్టేడియం!

కలం, వెబ్​ డెస్క్​ : హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మరో భారీ పోరుకు సిద్ధమైంది. ఐపీఎల్ ప్రస్తుత సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) తన తొలి మ్యాచ్‌ను రేపు (శనివారం) ఆడనుండటంతో అభిమానుల ఉత్సాహం ఆకాశాన్ని తాకుతోంది. సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుక కోసం నగరంలోని క్రికెట్ ప్రేమికులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ మ్యాచ్ సందర్భంగా ధోనిపై తమకున్న అభిమానాన్ని చాటుకునేందుకు ఫ్యాన్స్ ఇప్పటికే స్టేడియం పరిసరాల్లో భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. స్టేడియం మొత్తాన్ని పసుపు రంగుతో నింపేయాలని, ప్రతి ఒక్కరూ ఈ పండుగలో భాగస్వాములు కావాలని సోషల్ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు. ధోని (MS Dhoni) బ్యాటింగ్ చూసేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి అభిమానులు తరలివస్తుండటంతో ఉప్పల్ పరిసర ప్రాంతాలు సందడిగా మారనున్నాయి. ఈ సీజన్‌లో ధోని మొదటి మ్యాచ్ కావడంతో రికార్డు స్థాయిలో జనం హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>