కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రజలు చక్కని అవకాశాన్ని కోల్పోయారని ప్రధాని మోదీ (PM Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో సహా విపక్షాలు డీలిమిటేషన్ పై తప్పుడు ప్రచారం చేశాయని పేర్కొన్నారు. డీలిమిటేషన్ తో ఆయా రాష్ట్రాలలో సీట్లు పెరుగుతాయని చెప్పుకొచ్చారు. డీలిమిటేషన్ తో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో సీట్లు పెరిగేవని ఆరోపించారు. కాంగ్రెస్ తో సహా విపక్ష పార్టీల తీరు వల్ల ఇది నీరుగారిపోయిందని వెల్లడించారు. ప్రధానంగా డీఎంకే, టీఎంసీ, ఎస్సీ పార్టీ ల కారణంగానే పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రజలు చక్కని అవకాశాన్ని కోల్పోయారని వివరించారు. కాగా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ జరుగుతున్న వేళ ప్రధాని మోదీ చేసిన తాజా వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారింది. ప్రధాని మోదీ వ్యాఖ్యలతో ఆయా రాష్ట్రాలలో ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
Read Also: ఇండియాను మోదీ అమ్మేశారు: రాహుల్ గాంధీ
Follow Us On : WhatsApp

