కలం మెదక్ బ్యూరో: తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్ర బీజేపీ సర్కార్ చిత్తశుద్దితో పనిచేస్తోందని ఎమ్మెల్సీ అంజిరెడ్డి (MLC Anji Reddy) అన్నారు. రాజకీయాలకు అతీతంగా, దేశ ప్రధాని మన రాష్టానికి వస్తున్న వేళ.. ప్రతి ఒక్కరూ సభకు హాజరు కావాలని అంజిరెడ్డి కోరారు. ఈ నెల 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ప్రజలు తరలి రావాలని అన్నారు. ఈ నేపథ్యంలో రామచంద్రపురంలో సంగారెడ్డి (Sangareddy) బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరితో కలిసి ఇంటి ఇంటికి వెళ్లి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి (MLC Anji Reddy) మాట్లాడుతూ.. ప్రధాని మోడీ 10వ తేదీన సుమారు రూ.8 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు. ఈ అభివృద్ధి పనులలో సంగారెడ్డి జిల్లా పరిధిలో రూ.2,360 కోట్లతో జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ నిర్మాణానికి సైతం శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు మోడీ సభకు వచ్చి విజయవంతం చేయాలని కోరారు.

