అత్తాపూర్‌లో యువతి కిడ్నాప్.. కలకలం రేపుతున్న ఘటన

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో (Attapur) అర్ధరాత్రి ఓ యువతి కిడ్నాప్‌ (Kidnap)కు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం.. ఓ థార్ కారులో వచ్చిన నలుగురు యువకులు ఓ యువతిని బలవంతంగా కారులోకి ఎక్కించుకుని అక్కడి నుండి వేగంగా పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై, అత్తాపూర్ నుంచి ఆరంఘర్ చౌరస్తా వరకు కారును ఛేజ్ చేశారు. అయితే, ఆ కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడం, నిందితులు మితిమీరిన వేగంతో దూసుకెళ్లడంతో పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>