కలం, డెస్క్ : తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో వరుసగా ఫుడ్ పాయిజన్లు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. స్టూడెంట్లు పదుల సంఖ్యలో తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. తాజాగా మెదక్ (Medak) జిల్లా రేగోడ్ మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో షాకింగ్ ఘటన జరిగింది. ఉదయం టిఫిన్ తిన్న 22 మంది స్టూడెంట్లు, ముగ్గురు టీచర్లు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.


