కలం, వెబ్ డెస్క్ : జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా (Kupwara) మెయిన్ బస్ స్టాండ్లో గత రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఆరు బస్సులు పూర్తిగా మంటల్లో చిక్కుకున్నాయి.
సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో మొత్తం ఏడు బస్సులు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు, ఎవరికీ గాయాలు కూడా కాలేదు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు, సంబంధిత అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.
Read Also: జనాభా లెక్కలు.. ఎన్నో ప్రశ్నలు
Follow Us On : WhatsApp

