కలం, వెబ్ డెస్క్ : ‘ఆపరేషన్ కగార్’ తో ఉనికిని కోల్పోయే పరిస్థితుల్లో ఉన్న మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఏరివేత చర్యల్లో భాగంగా పోలీసులు, భద్రతా బలగాలు నారాయణపూర్ జిల్లాలో నిర్వహించిన కూంబింగ్లో మావోయిస్టులు అత్యంత రహస్యంగా భూమి కింద దాచి ఉంచిన ఓ భారీ డంప్ (Maoists Dump Seized) ను కనిపెట్టారు. ఈ మేరకు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థులు లభ్యమయ్యాయి.
ఇందులో భాగంగా 11 ఆయుధాలతో పాటు రూ. 24 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అడవుల్లో ఇంకా ఏమైనా ఇలాంటి రహస్య నిల్వలు ఉన్నాయా అనే కోణంలో డాగ్ స్వ్కాడ్స్ మెటల్ డిటెక్టర్లతో గాలింపు చర్యలు చేస్తున్నారు. కొద్ది కాలం భద్రతా బలగాల కూంబింగ్ జరగనుండడంతో ఆ ప్రాంతంతో హై టెన్షన్ నెలకొంది.

