Mobile Popup Ad
Mobile Popup Ad

బెంగళూరులో వీఐపీ మూమెంట్ కలకలం.. వ్యక్తి నిరసన వైరల్

కలం, వెబ్ డెస్క్ :  బెంగళూరులోని (Bengaluru) ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్‌లో గవర్నర్ కాన్వాయ్ (Governor Convoy) కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయిన ఘటనపై ఓ వ్యక్తి ఆగ్రహంతో రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపాడు. గర్భిణీ భార్యతో కలిసి ప్రయాణిస్తున్న ఆ వ్యక్తి, దీర్ఘకాలంగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యాడు.

కారు లోపల భార్య ఉండగానే, ఆ వ్యక్తి వాహనం నుంచి బయటకు వచ్చి రోడ్డుపై కూర్చుని నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీఐపీ కాన్వాయ్‌ల కారణంగా సాధారణ ప్రజలకు ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులపై మరోసారి చర్చకు దారితీసింది. అధికారులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై దృష్టి పెట్టాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>