కలం, రఘునాథపల్లి: జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలం బానాజీపేట (Banajipet) గ్రామంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. మెయిన్ రోడ్డు సమీపంలోని ఫ్యాక్టరీ వద్ద జరిగినఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని వరంగల్ జిల్లా కరీంబాద్కు చెందిన కొల్పుల కుమారస్వామి (50)గా గుర్తించారు. తన కూతుర్ని తీసుకొని బంధువుల ఇంటికి వచ్చి వెళుతుండగా మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగింది. కుమారస్వామి తలకు తీవ్ర గాయమైంది. ఆయనను జనగామ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

