epaper
Monday, March 2, 2026
epaper

శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు షురూ

కలం, వెబ్ డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం (Srisailam)లో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 7 రోజులపాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సోమవారం ఉదయమే ఆలయ పూజారులు స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు చేసి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఉదయం 9.15 గంటలకు భగవానుడి యాగశాల ప్రవేశం, ఆ తర్వాత వేద పండితులు చతుర్వేద పారాయణం నిర్వహిస్తారు. విశ్వ సంక్షేమం కోసం బ్రహ్మోత్సవ సంకల్పాన్ని నిర్వహిస్తారు. అలాగే గణపతి పూజ, స్వస్తి పుణ్య వచనం, బ్రహ్మోత్సవాలను పర్యవేక్షించే ప్రధాన దేవత చందీశ్వర ప్రత్యేక పూజలు చేస్తారు. ఋత్విగ్రహణం, అఖండ దీపారాధన, వాస్తు పూజ, వాస్తు హోమం, కలశ స్థానం, జపం, పారాయణాలు సహా పలు పవిత్ర పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

సాయంత్రం ధ్వజారోహణ, ధ్వజపటావిష్కరణ కార్యక్రమాలు జరుగుతాయి. జనవరి 13 నుంచి లక్ష్మీ కల్యాణ పూజలు జరగనున్నాయి. జనవరి 15న ( మకర సంక్రాంతి) బ్రహ్మోత్సవ కల్యాణం, జనవరి 17న యాగ పూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూల స్నానం, జనవరి 18న పుష్పోత్సవం, శయనోత్సవం ఏకాంత సేవ కార్యక్రమాలు జరగనున్నాయి. సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) భాగంగా ఆలయ అధికారులు ప్రతిరోజు జరిగే పరోక్ష పూజలను నిలిపివేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!