కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మదనపల్లిలో నూతనంగా నిర్మించిన శివాలయాన్ని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సందర్శించారు. ఆలయ అర్చకులు, దేవస్థాన అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు..

