Mobile Popup Ad
Mobile Popup Ad

వరుడి ఊళ్లో ప్రియుడు.. అర్ధరాత్రి ఏం చేశాడంటే?

కలం, వెబ్ డెస్క్ : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి (Thangallapalli) మండలంలో ఓ ప్రేమ వ్యవహారం కలకలం రేపింది. ఏడేళ్లుగా ఓ యువతి, యువకుడు ప్రేమించుకుంటున్నారు. అయితే యువతి కుటుంబ సభ్యులు బలవంతంగా వేరే వ్యక్తితో ఆమెకు వివాహం నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు తీవ్ర ఆవేదనకు గురై ఒక వినూత్న నిరసనకు తెరలేపాడు.

కేవలం కట్నం, బంగారం కోసమే సదరు వరుడు ఈ పెళ్లికి ఒప్పుకున్నాడని ఆరోపిస్తూ.. ప్రియుడు తన ప్రేమ తాలూకు ఫొటోలను, అలాగే పెళ్లి కొడుకు వివరాలను వాల్ పోస్టర్లుగా ముద్రించాడు. అర్ధరాత్రి వేళ వరుడి గ్రామమంతటా ఆ పోస్టర్లను అంటించడంతో ఉదయాన్నే స్థానికులు చూసి షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఈ వాల్ పోస్టర్ల వ్యవహారం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారడమే కాకుండా, సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>