కలం, వెబ్ డెస్క్: జగిత్యాల (Jagtial) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం ఓ ప్రేమ జంట అదృశ్యమవగా తాజాగా ప్రియుడు కాలువలో శవమై తేలాడు. మెట్పల్లి మండలంలోని పెద్దాపూర్లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రకు చెందిన అంకుష్ అనే యువకుడు కూలీ పనుల కోసం కొంత కాలం క్రితం మెట్పల్లికి వచ్చాడు. మెట్పల్లి మండలంలోని వెల్లుల గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. రెండు రోజుల నుంచి యువతితో పాటు అంకుష్ కనిపించడం లేదు. ఈ క్రమంలో తాజాగా స్థానిక ఎస్సారెస్పీ కాలువలో అంకుష్ మృతదేహం లభ్యమైంది. యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరు ఆత్మహత్య చేసుకొని ఉంటారా? లేక ఎవరైనా అంకుష్ను హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

