కలం, కరీంనగర్ బ్యూరో: థ్రిల్లర్ జానర్లో రూపొందుతున్న “లీసా” సినిమా (Lisa Movie) షూటింగ్ ప్రస్తుతం కరీంనగర్లో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ విజయవంతంగా పూర్తయింది. అనంతరం చిత్ర బృందం రెండో షెడ్యూల్ కోసం కరీంనగర్కు చేరుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్గా “వకీల్ సబ్” మూవీ ద్వారా గుర్తింపు పొందిన అనన్య నాగల్ల నటిస్తున్నారు. నిర్మాతలుగా వెంకట్ రెడ్డి దుగ్గిరెడ్డి, రామకృష్ణ వ్యవహరిస్తున్నారు. కో-ప్రొడ్యూసర్గా, స్క్రీన్ప్లే , సినిమాటోగ్రఫీ (DOP) బాధ్యతలను సతీష్ రెడ్డి మాసం నిర్వహిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పులి రాకేష్ గౌడ్, లైన్ ప్రొడ్యూసర్ శ్రవణ్ బోనాల, శ్రీపతి బండ్ల వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం జవహర్ రాజు వహిస్తున్నారు. థ్రిల్లర్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. కరీంనగర్ లోని మానేరు డ్యాంతో పాటు వివిధ లొకేషన్లలో చిత్ర యూనిట్ సందడి చేస్తోంది.

