ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నాయ‌కులు

కలం, వరంగల్ బ్యూరో: మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించి మహిళా నాయకత్వాన్ని కించపరిచార‌ని ఇండియా కూటమి వైఖరిని ఖండిస్తూ హన్మకొండ (Hanumakonda) అదాలత్ జంక్షన్‌లో బీజేపీ నాయ‌కులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ నిరసన తెలిపారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>