కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Leopard Nizamabad) జిల్లా మోస్రా మండలం గోవూర్ శివారులో చిరుత పులి సంచరిస్తోంది. పంట పొలాల్లో చిరుత పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో చిరుత సంచరించినట్లు పాదముద్రల ఆధారంగా అధికారులు ధృవీకరించారు. మోస్రా, చింతకుంట, తిమ్మాపూర్, 6 నంబర్ తండా అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తోందని అధికారులు తెలిపారు. రైతులు పంట పొలాల్లోకి ఒంటరిగా వెళ్లొద్దని, చప్పుడు చేస్తూ వ్యవసాయ పనులు చేసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండా లన్నారు.

