కలం, వెబ్ డెస్క్: ఛత్తీస్గఢ్లోని కర్రెగుట్టల (Karregutta) అడవుల్లో మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మైన్ పేలడంతో ఓ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. జెల్ల-పామునూరు మార్గంలో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 39వ బెటాలియన్కు చెందిన జవాన్ రాజన్ ఈ పేలుడులో తీవ్రంగా గాయపడ్డాడు. అధికారులు వెంటనే ఆయనను మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా, అదే ప్రాంతంలో బాంబు డిస్పోజల్ స్క్వాడ్ (BDS) బృందాలు శుక్రవారం ఉదయం నుంచి తనిఖీలు చేపట్టి, మావోయిస్టులు అమర్చిన 11 ఐఈడీ (IED)లను గుర్తించి నిర్వీర్యం చేశాయి.


