కలం, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) బహిరంగలేఖ రాశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సగం కాలం పూర్తవుతోందని, ఇప్పటికీ కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో అధిక శాతం పెండింగ్ లోనే ఉన్నాయని, ఈ సారైన బడ్జెట్లో కేటాయింపులు చేయాలని పేర్కొంటూ ఆయన ఈ లేఖ రాశారు.
ఆరు గ్యారెంటీల (Six Guarantees) పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చి వాటి అమలును పక్కన పెట్టారని, రెండు బడ్జెట్లలో హామీల అమలు కోసం కేటాయింపులు చేయలేదని కేటీఆర్ గుర్తు చేశారు. ముఖ్యంగా ఆరు గ్యారెంటీల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలు, వృద్ధులు, విద్యార్థి, యువత, రైతన్నల కోసం భారీగా నిధులు కేటాయించాలన్నారు. డిక్లరేషన్ల పేరుతో హామీలు ఇచ్చిన మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు.
ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకువస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దాని నిలబెట్టుకోవాలని సూచించారు. 2026-2027 బడ్జెట్లో 6 గ్యారెంటీలు, హామీలు, డిక్లరేషన్ల కింద ఇచ్చిన వాగ్దానాల అమలుకు తగిన నిధులు కేటాయించకపోతే, ఎక్కడికక్కడ కాంగ్రెస్ను ప్రజలపక్షాన నిలదీస్తామని కేటీఆర్ (KTR) హెచ్చరించారు.
Read Also: కేసుల భయంతోనే కాంగ్రెస్తో బీఆర్ఎస్ ‘డీల్’ రాజకీయాలు: ధర్మపురి అరవింద్
Follow Us On : WhatsApp


