కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని (Kothapalli) మార్కండేయ చేనేత పారిశ్రామిక సంఘం అధ్యక్షుడిగా మంచికట్ల కోటేశ్వర్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి వి.నిర్మల తెలిపారు. శుక్రవారం నిర్వహించిన సంఘం ఎన్నికల్లో ఉపాధ్యక్షులుగా మంచికట్ల భారతి, కోశాధికారిగా మచ్చ రాములు, డైరెక్టర్లుగా గుండేటి వేణుగోపాల్, భోగ వీరేశం, తుమ్మ సుగుణ, బిల్ల మల్లేశం, వేముల శంకర్, పెంటి లక్ష్మీనారాయణను ఎన్నుకున్నట్లు ప్రకటించారు.

