పెద్దపల్లిలో కత్తిపోట్ల కలకలం!

క‌లం, వెబ్ డెస్క్‌: పెద్ద‌ప‌ల్లి (Peddapalli) జిల్లాలో దారుణ ఘ‌ట‌న జ‌రిగింది. కుటుంబ క‌ల‌హాల‌తో ఓ వ్య‌క్తి త‌న పిన్ని, త‌మ్ముడిపై క‌త్తితో దాడి (Knife Attack) చేశాడు. ఈ ఘ‌ట‌న పెద్దపల్లి జిల్లాలోని మార్కండేయ కాలనీలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరగ‌గా రామ్ దూత్ అనే వ్య‌క్తి త‌న పిన్ని సుమిత్ర, ఆమె కొడుకు ప్రణయ్‌పై దాడి చేశాడు. ఈ క్ర‌మంలో అడ్డొచ్చిన‌ కొమురమ్మను విచ‌క్ష‌ణార‌హితంగా క‌త్తితో పొడిచాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర‌ గాయాల‌య్యాయి. వీరిలో ప్ర‌ణ‌య్‌ పరిస్థితి విషమంగా ఉన్న‌ట్లు స‌మాచారం. పోలీసులు రామ్‌దూత్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>