Mobile Popup Ad
Mobile Popup Ad

యువతలో పెరుగుతున్న కిడ్నీ సమస్యలు.. అసలు కారణమిదే!

కలం, వెబ్ డెస్క్: కిడ్నీలో రాళ్లు (Kidney Stones) అనగానే సాధారణంగా వయసు పైబడినవారికి వచ్చే సమస్యగా భావిస్తారు. కానీ ఈ ఇయర్ సమ్మర్ సీజన్‌లో 20, 30 ఏళ్ల వయసున్నవారు కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. హీట్ వేవ్, తగినంత నీరు తాగకపోవడం, మారుతున్న జీవనశైలి అలవాట్లు దీనికి ప్రధాన కారణాలు. ముఖ్యంగా శరీరంలో నీటి శాతం తగ్గడం కూడా. వేసవిలో చెమట రూపంలో శరీరం ఎక్కువ నీటిని కోల్పోతుంది, కానీ చాలా మంది దానికి సరిపడా నీటిని తాగడం లేదు.

ఏసీ గదుల్లో ఎక్కువ గంటలు గడిపే ఆఫీసు ఉద్యోగుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. వీరికి దాహం వేయకపోవడం వల్ల శరీరానికి కావలసిన దానికంటే చాలా తక్కువ నీరు తాగుతుంటారు. మరొక కారణం హై-ప్రోటీన్ ఆహారాలకు పెరుగుతున్న ప్రజాదరణ. బరువు తగ్గడానికి, కండరాలు పెంచడానికి ప్రయత్నిస్తున్న చాలామంది యువకులు సప్లిమెంట్లు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ప్యాక్ చేసిన ఫుడ్ తీసుకుంటున్నారు. ప్రొటీన్లు శరీరానికి ముఖ్యమైనవే అయినప్పటికీ, దానికి తగ్గట్టుగా నీరు తీసుకోకపోవడంతో కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉండటం కూడా మరో ఆందోళనకరమైన విషయం. ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఇన్‌స్టంట్ మీల్స్, స్నాక్స్, రెస్టారెంట్ వంటకాల్లో సోడియం స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.

ఎక్కువ ఉప్పు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కిడ్నీలు మూత్రంలోకి ఎక్కువ కాల్షియంను విడుదల చేస్తాయి. ఇది రాళ్లు ఏర్పడే అవకాశాలను పెంచుతుంది. బిజీ పని వేళల కారణంగా ప్రజలు దాహాన్ని నిర్లక్ష్యం చేయడం, వాష్‌రూమ్‌కు ఆలస్యంగా వెళ్లడం, భోజనం మానేయడం లాంటి అలవాట్లు మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అయితే సరైన జాగ్రత్తలతో కిడ్నీలో రాళ్లను నివారించవచ్చు. రోజంతా తగినంత నీరు తాగాలి. అలాగే ఉప్పు తగ్గించడం, పండ్లు, కూరగాయలు తీసుకోవడం, మూత్ర విసర్జనను ఆపుకోకపోవడం లాంటి జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు చెప్తున్నారు.

Read Also: ఎక్సర్‌సైజ్ చేస్తున్నపుడు ఆ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>