కలం, వెబ్డెస్క్: మరణం ఎప్పుడు, ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. తరగతి గదిలో పాఠం చెబుతుండగానే ఓ లెక్చరర్ ప్రాణాలు విడిచిన విషాదకర సంఘటన ఖమ్మం (Khammam) జిల్లాలో చోటుచేసుకుంది. నగరంలోని ఒక ప్రైవేట్ కాలేజీలో ఓ లెక్చరర్ (Lecturer) విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. ఈ సమయంలో ఆయన అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కాలేజీ యాజమాన్యం ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
Read Also: సీనియర్ కాళ్లు మొక్కిన ప్రధాని.. ఆ పెద్దాయన ఎవరో తెలుసా?
Follow Us On: WhatsApp

