Mobile Popup Ad
Mobile Popup Ad

హిమాన్షుకు గాయం.. ఏఐజీకి వస్తున్న కేసీఆర్!

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు హిమాన్షు (Himanshu) ప్రమాదానికి గురయ్యాడు. జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఆయన ముక్కుకు గాయమైనట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు హిమాన్షు‌ను హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో గల ఏఐజీ (AIG) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందుతోంది. విషయం తెలుసుకున్న మాజీ సీఎం కేసీఆర్ (KCR) తన మనుమడిని పరామర్శించేందుకు ఏఐజీ ఆసుపత్రికి బయలుదేరారు. హిమాన్షు ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు ఆసుపత్రికి చేరుకుంటున్నారు.

Read Also: లిఫ్ట్ ఇస్తే చోరీ చేశాడు.. ట్రక్ డ్రైవర్‌ వద్ద డబ్బులు దొంగిలించిన ఎస్ఐ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>