కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై టీఆర్ఎస్ చీఫ్ కవిత (Kavitha) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయనకు గట్టి కౌంటర్ ఇస్తూ, గతంలో జరిగిన విషయాలను ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. ‘ఇదివరకు ఒకసారి నాతో పెట్టుకున్నారు.. అప్పుడు మేం ఓడగొట్టి చూపించాం, మళ్లీ ఇంకోసారి నాతో పెట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.. జాగ్రత్త!’ అంటూ కవిత హెచ్చరించారు. రాజకీయాల్లో తమతో వైరం పెట్టుకుంటే ఫలితాలు ఎలా ఉంటాయో గతంలోనే రుచి చూశారని, భవిష్యత్తులోనూ అదే పునరావృతమవుతుందని కవిత (Kavitha) స్పష్టం చేశారు.

