జనగణనలో ఓబీసీ కాలమ్ ఉండాల్సిందే: కవిత డిమాండ్

కలం, వెబ్‌ డెస్క్‌ : దేశంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం ఎంతమంది వెనుకబడిన ప్రజలు ఉన్నారనే విషయం ఏ ప్రభుత్వానికైనా తెలిసి ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించడం పట్ల టీఆర్‌ఎస్ చీఫ్‌ కవిత (Kavitha) స్పందించారు. వెనుకబడిన తరగతుల డిమాండ్లను సుప్రీంకోర్టు చాంబర్లు సైతం ప్రతిధ్వనించడం ఒక గొప్ప ముందడుగు అని ఆమె అన్నారు. పరిపాలన, సంక్షేమంలో బీసీ సామాజిక వర్గానికి దక్కాల్సిన సరైన వాటాను నిర్ధారించేందుకు ఇది ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం వెంటనే తన విధానాలను సరిదిద్దుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రాబోయే జనగణనలో ఓబీసీల కోసం ప్రత్యేక కాలమ్‌ను చేర్చాలని స్పష్టం చేశారు. అలాగే ఈ జనాభా గణన పూర్తయిన తర్వాత పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఓబీసీ సబ్ కోటాతో కలిసి తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కీలకమైన ఉప కోటాను చేర్చకపోతే మహిళా రిజర్వేషన్ల మొత్తం విధానం దాని అసలు లక్ష్యాన్ని నెరవేర్చడంలో విఫలమవుతుందని కవిత (Kavitha) హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>