Mobile Popup Ad
Mobile Popup Ad

మొరాకోలో భారత గోల్ఫర్ల సవాల్.. కరందీప్‌పై భారీ ఆశలు

కలం, వెబ్ డెస్క్: మొరాకోలో జరుగుతున్న 20 లక్షల డాలర్ల ఇంటర్నేషనల్ సిరీస్ టోర్నీలో భారత్ నుంచి 10 మంది గోల్ఫర్లు బరిలోకి దిగుతున్నారు. వీరిలో అందరి చూపు కరందీప్ కొచ్చర్‌(Karandeep Kochhar)పైనే ఉంది. 26 ఏళ్ల కరందీప్ ఈ సీజన్‌లో ఆడిన ఐదు ఆసియన్ టూర్ ఈవెంట్లలో మూడుసార్లు టాప్-10లో నిలిచాడు. ఫిలిప్పీన్స్‌లో నాలుగో స్థానం, జపాన్‌లో ఐదో స్థానం, గత వారం భారత్ క్లాసిక్‌లో టాప్-10 ఫినిష్‌తో మంచి ఫామ్‌లో ఉన్నాడు. గత మూడు వారాలుగా మొరాకోలో వరుస టోర్నీలు ఆడుతున్న కరందీప్ అలసట ఉన్నప్పటికీ ఈ టోర్నీ తన కెరీర్‌కు కీలకమని భావిస్తున్నాడు. ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

అనిర్బన్ లాహిరి, గగన్‌జీత్ భుల్లర్, ఉదయన్ మానే, ఎస్‌ఎస్‌పీ చౌరాసియా, ఆర్యన్ రూపా ఆనంద్‌తో పాటు రషీద్ ఖాన్, శౌర్య భట్టాచార్య, అజీతేష్ సంధు, శుభమ్ జగ్లాన్ కూడా పోటీలో ఉన్నారు. టోర్నీకి ముందు అనిర్బన్ లాహిరితో సరదా మ్యాచ్ ఆడిన కరందీప్, చివరి రెండు హోల్స్‌లో బర్డీలు కొట్టి మ్యాచ్‌ను సమం చేశాడు. అనిర్బన్ లాంటి అనుభవజ్ఞుడితో కలిసి ఆడటం యువ ఆటగాళ్లకు గొప్ప అవకాశమని కరందీప్ పేర్కొన్నాడు. ప్రపంచ గోల్ఫ్‌లో భారత్‌కు ఆయన గొప్ప ప్రతినిధిగా నిలుస్తున్నారని అభినందించాడు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కరందీప్ కొచ్చర్.. మొరాకోలో మరో మెరుగైన ప్రదర్శన కోసం సిద్ధంగా ఉన్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>