కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ జాగృతి ద్వారా సాంస్కృతిక పునరుజ్జీవనానికి కృషి చేసిన కల్వకుంట్ల కవిత, నేడు తన నూతన రాజకీయ ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆమె తన కొత్త రాజకీయ పార్టీ పేరు టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) ని ప్రకటించారు.
సభా ప్రాంగణానికి చేరుకున్న కవితకు కార్యకర్తలు, మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆమె వేదికపై పార్టీ జెండాను ఆవిష్కరించి (Kavitha New Party Flag), అధికారికంగా పార్టీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాంగణమంతా అభిమానుల కోలాహలంతో మిన్నంటింది. జెండా ఆవిష్కరణ అనంతరం ఆమె మాట్లాడుతూ తన రాజకీయ ప్రయాణం వెనుక ఉన్న ఉద్దేశ్యాలను వివరించారు.
Read Also: కొత్త పార్టీ పేరు ప్రకటించిన కవిత..
Follow Us On: X(Twitter)

