కలం, నిజామాబాద్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులుగా కైలాస్ శ్రీనివాస్ గుప్తా (Kailas Srinivas) ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఈ మేరకు కైలాస్ శ్రీనివాస్ కు నియామక పత్రం అందజేశారు. కామారెడ్డికి చెందిన కైలాస్ శ్రీనివాస్ గుప్తా గతంలో కూడా పలు పదవులు నిర్వహించారు. ఇప్పుడు ఆర్య వైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎంపిక కావడం పట్ల జిల్లా నేతలు కామారెడ్డి ఆర్య వైశ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్య వైశ్యుల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం కృషి చేస్తానని కైలాస్ శ్రీనివాస్ చెప్పారు..

