కలం, వెబ్ డెస్క్: ఏపీ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ (Justice Lisa Gill) ప్రమాణం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ లోక్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో సీజేతో ప్రమాణం చేసి.. శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ రికార్డు నెలకొల్పారు. జస్టిస్ లీసా గిల్ 2014, మార్చి 31న పంజాబ్-హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గత నెలలో ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ప్రస్తుత సీజే పదవీ విరమణతో సీనియార్టీ పరంగా రెండో స్థానంలో జస్టిస్ లీసా గిల్ సీజేగా ఎంపికయ్యారు. ఈ మేరకు ఈ రోజు బాధ్యతలు చేపట్టారు.

