epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఝాన్సీరెడ్డి, ఎర్రబెల్లి ఒక్కటయ్యారు.. కాంగ్రెస్​ నేత సంచలన ఆరోపణలు

కలం, వెబ్​ డెస్క్​ : పాలకుర్తి కాంగ్రెస్​ నాయకురాలు ఝాన్సీరెడ్డి (Jhansi Reddy)పై ఆ పార్టీ సీనియర్ నేత హరిప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలకుర్తి (Palakurthi) నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు (Errabelli Dayakar Rao), ఝాన్సీ రెడ్డి కోవర్ట్​ రాజకీయాలు చేస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరూ కలిసి పనిచేశారన్నారు. జమస్తాన్​పురంలో బీఆర్​ఎస్​ మద్ధతు ఇచ్చిన సర్పంచ్​ అభ్యర్థికి ఝాన్సీరెడ్డి సపోర్ట్​ చేశారని.. చెర్లపాలెం, మడిపల్లి, సోమారం గ్రామాల్లో ఝాన్సీరెడ్డి అనుచరులకు ఎర్రబెల్లి దయాకర్​ రావు మద్ధతు ఇచ్చాడని హరిప్రసాద్​ ఆరోపించారు.

కాంగ్రెస్​ రెబెల్స్​ గెలిస్తే వాళ్లను బలపరచినట్లు ఎర్రబెల్లి చెప్పుకుంటున్నారని హరిప్రసాద్​ వ్యాఖ్యానించారు. సోమారంలో ఎర్రెబెల్లికి ఏజెంట్లు కూడా లేరని.. మడిపల్లిలో ఎర్రబెల్లి మద్దతు ఇచ్చిన అభ్యర్థిని ఝాన్సీ రెడ్డి కొనుగోలు చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బులు ఉన్నాయని ఝాన్సీరెడ్డి (Jhansi Reddy).. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని ఎర్రబెల్లి ఇద్దరూ ఒక్కటయ్యారని హరిప్రసాద్ (Hari Prasad)​ ఆరోపించారు. వీరి కోవర్ట్ బంధాన్ని త్వరలో బయటపెడుతామని సీనియర్​ కాంగ్రెస్​ నేత హరిప్రసాద్​ హెచ్చరించారు. కాగా, హరిప్రసాద్​ కోవర్ట్​ వ్యాఖ్యలపై పాలకుర్తి రాజకీయాల్లో చర్చ మొదలయింది.

Read Also: ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>