epaper
Tuesday, January 20, 2026
spot_img
epaper

రేపటి నుంచి జేఈఈ మెయిన్స్​.. సెంటర్స్​ ఇవే

కలం, వెబ్​డెస్క్​: దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ (NIT)ల్లో ఇంజనీరింగ్ ​(బీటెక్​), ఆర్కిటెక్చర్​(బీఆర్క్​), బి.ప్లానింగ్​లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్​ ఎంట్రెన్స్​ ఎగ్జామినేషన్​ (మెయిన్​) పరీక్షలు (JEE Main 2026) రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21, 22,23, 24, 28, 29 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. మొదటి ఐదు రోజులు పేపర్​–1, 29వ తేదీన పేపర్​–2 పరీక్ష ఉంటుంది. రోజూ ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12వరకు, తిరిగి మధ్యాహ్నం 3నుంచి 6గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే పేపర్​–1కు సంబంధించి అడ్మిట్​ కార్డులు రిలీజయ్యాయి. పేపర్​–2కు అడ్మిన్​ కార్డులు త్వరలోనే రిలీజ్​ చేస్తారు. పరీక్షలను తెలుగు, ఇంగ్లీష్​తో పాటు మరో 13 భాషాల్లో నిర్వహిస్తారు. ఎగ్జామ్​ సెంటర్స్​ వివరాలు నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ (NTA) ఇది వరకే ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:

ఆంధ్రప్రదేశ్​: అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, తాడేపల్లిగూడెం, ఆదోని, అమలాపురం, మదనపల్లె, మార్కాపురం, పుత్తూరు, రాయచోటి, తాడిపత్రి, తిరువూరు.

తెలంగాణ: కరీంనగర్​, ఖమ్మం, మహబూబ్​నగర్​, నల్లగొండ, వరంగల్​, నిజామాబాద్​, సూర్యాపేట, సిద్ధిపేట, జగిత్యాల, కొత్తగూడెం, హైదరాబాద్​, ఆదిలాబాద్​, కోదాడ, పెద్దపల్లి.

తెలుసుకోవాల్సినవి:
  • అభ్యర్థులు అడ్మిన్​ కార్డు (JEE Main 2026) లోని పరీక్ష తేదీ, షిఫ్ట్​, టైమింగ్స్​, సెంటర్​, పరీక్ష కేంద్రాల వద్ద రిపోర్ట్​ చేయాల్సిన టైమ్​, గేట్​ క్లోజింగ్​ గురించి ముందుగానే తెలుసుకోవాలి.
  • అడ్మిన్​ కార్డు ప్రింటవుట్​ తీసుకొని.. దానిపై ఫొటో అతికించాలి. వేలిముద్ర వేయాలి. పాస్​పోర్ట్​ సైజు ఫొటో, రిజిస్ట్రేషన్​కు ఇచ్చిన ఐడెంటిటీ కార్డు (ఆధార్​ వంటివి) ఒరిజినల్​ తీసుకెళ్లాలి.
  • పరీక్ష కేంద్రానికి కాస్త ముందుగానే చేరుకోవాలి. ఉదయం షిఫ్ట్​లో 7.30 నుంచి 8.30 గంటల మధ్య; మధ్యాహ్నం షిఫ్ట్​కు 1.30 నుంచి 2.30గంటల మధ్య విద్యార్థులను అనుమతిస్తారు.
  • రిజిస్ట్రేషన్​కు ఆధార్​ కాకుండా వేరే గుర్తింపు కార్డు ఉపయోగించినవాళ్లు పరీక్ష సెంటర్​ గేటు మూయడానికి గంట ముందే ఎగ్జామ్​ సెంటర్​కు చేరుకోవాలి.
  • పరీక్ష కేంద్రాల్లోకి జామెట్రీ/పెన్సిల్​ బాక్స్​, హ్యాండ్​ బ్యాగ్​, పర్స్​తోపాటు ఎలాంటి పేపర్లూ అనుమతించరు. అలాగే ఆహార పదార్థాలు, మొబైల్​, ఇయర్​ ఫోన్స్​, ఎలక్ట్రానిక్​ పరికరాలు తీసుకెళ్లకూడదు.పెద్ద బటన్స్ ఉండే దుస్తులు ధరించి వస్తే అనుమతించరు. డయాబెటిక్​ విద్యార్థులు ట్యాబ్లెట్లు, మెడిసిన్​ సంబంధిత ప్రూట్స్​ తెచ్చుకోవచ్చు.

Read Also: బీఆర్ఎస్‌తో వైసీపీ.. కాంగ్రెస్‌తో టీడీపీ.. ఖమ్మంలో పొత్తులుంటాయా..?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>