epaper
Wednesday, February 18, 2026
epaper

సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులపై జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు

కలం, వెబ్​ డెస్క్​ : సంగారెడ్డి మున్సిపల్​ పోలింగ్ (Sangareddy Municipal Polls) వేళ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్​ కార్యకర్త కాలర్​ పట్టుకున్నారంటూ పోలీసులపై టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 34 వ వార్డు అభ్యర్థిని అడ్డుకున్న సీఐ.. కాలర్​ పట్టుకున్నారంటూ ఆరోణల నేపథ్యంలో గొడవ మొదలైంది. ఈ విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి పోలింగ్​ బూత్​ దగ్గరకు చేరుకుని సీఐ తీరుపై ఫైర్​ అయ్యారు. పోలింగ్‌ ఆపెస్తానంటూ బూత్​ లోకి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులకు, కాంగ్రెస్ శ్రేణులకు తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. జగ్గారెడ్డి వినకుండా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘రిగ్గింగ్​ చేస్తున్నారని చెబితే మా అభ్యర్థిపై సీఐ గల్లా పట్టుకున్నాడు. ఆ సీఐ మొగుడు అయితే ఇక్కడికి రావాలి. జగ్గారెడ్డి (Jagga Reddy) ఎవరు అని అడుగుతారా? హోంగార్డులు ఎవర్రా మీరు. సంగారెడ్డిలో లా అండ్​ దెబ్బతింటే దానికి కారణం సీఐ శివకుమార్​, హోం గార్డులే కారణం’ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Read Also: రాష్ట్ర ఎన్నికల కమిషన్​ ఉందా? : కిషన్​ రెడ్డి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>